హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రదాత, బంగారు తెలంగాణ నిర్మాత, సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనారోగ్య సమస్యలన్నీ తొలగి, సంపూర్ణ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని ఆ సర్వేశ్వరుణ్ణి ప్రార్థిస్తూ… రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ తన కుటుంబ సభ్యులతో కలిసి మంత్రుల నివాస ప్రాంగణంలో నేడు వేదపండితులతో, నియమ నిష్టలతో మృత్యుంజయ హోమం నిర్వహించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల హఠాత్తుగా అనారోగ్యం పాలై ఆస్పత్రిలో చికిత్స పొందిన నేపథ్యంలో ఆయన అనారోగ్య పరిస్థితిపై తీవ్ర కలత చెందిన మంత్రి సత్యవతి రాథోడ్ వెంటనే కేసీఆర్ ఈ పరిస్థితి నుంచి తక్షణమే కోలుకోవాలని, సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఈ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే శక్తి పొందాలని కోరుకుంటూ ఈ మృత్యుంజయ హోమం జరిపారు.
ఉదయం 5 గంటలకు ప్రారంభమైన మృత్యుంజయ హోమం పూర్ణాహుతికి రాష్ట్ర శాసనసభా స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖల మంత్రి నిరంజన్ రెడ్డి, రాష్ట్ర షెడ్యూల్ తెగల, మైనారిటీ సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ గారు, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ నిర్వాహకులు, రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్, మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, సురభి వాణీ దేవి, తక్కెళ్లపల్లి రవీందర్, ఎమ్మెల్యేలు గండ్ర వెంకట రమణా రెడ్డి, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, పెద్ది సుదర్శన్ రెడ్డి, మహిళా కమిషన్ చైర్ పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి, మహబూబాబాద్ జడ్పీ చైర్ పర్సన్ కుమారి బిందు, ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ చైర్ పర్సన్ ఉషా దయాకర్ రావు, టిఆర్ఎస్ నేతలు కొంపల్లి శ్రీనివాస రెడ్డి, శ్రీధర్ రెడ్డి, నూకల శ్రీరంగారెడ్డి, సురేశ్ రావు, శ్రీరామ్ నాయక్, సిరి నాయక్, వనజా శ్రీరామ్, తదితరులు హాజరై, తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.