Minister Satyavathi Rathod | సీఎం కేసీఆర్ పాలనలో చెరువులకు మహర్దశ వచ్చిందని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. కేసీఆర్ కార్యదక్షత, దూరదృష్టి కారణంగా మండు వేసవిలో కూడా చెరువులు మత్తళ్లు దుంకుతున్నాయని తెలిపారు. మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన బొడ్రాయి పునఃప్రతిష్ఠాపన కార్యక్రమంలో మంత్రి సత్యవతి రాథోడ్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గంగమ్మ తల్లి ఆలయ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కురవి చెరవును మినీ రిజర్వాయర్గా మార్చేందుకు కృషి చేస్తానని తెలిపారు.
తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు బొడ్రాయి పండుగ నిర్వచనమని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ఊరిలోని వారంతా కలిసి ఐక్యమత్యంగా ఉండాలని, ఊరి బాగు కోసం ప్రతి ఒక్కరు ఆలోచించాలనేది దీని వెనక ఉన్న ప్రధాన ఆంతర్యమని తెలిపారు. ఇలాంటి సంప్రదాయాలకు తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసిఆర్ నాయకత్వంలో మళ్ళీ పూర్వ వైభవం వచ్చిందని అన్నారు.