గుజరాత్లో వర్షం పడితే.. మోదీకి పడిశం పడుతుందన్నది సామాజిక మాధ్యమాల్లో ప్రచారంలో ఉన్న ఓ వ్యంగ్య వాఖ్య. సొంత రాష్ట్రంలో ఎప్పుడు వరద వచ్చినా ప్రధానిగా ఆయన వెంటనే స్పందిస్తారు. ఏరియల్ సర్వే చేసి నష్టాన్ని పరిశీలిస్తారు. సమగ్ర నివేదికలు ఇంకా ఢిల్లీకి చేరకముందే వేల కోట్ల నిధులు ప్రకటిస్తారు.
2016లో తెలంగాణలో వరదల కారణంగా రూ.5వేల కోట్ల ఆస్తి, పంటనష్టం వాటిల్లింది. అడిగితే ప్రధాని మోదీ పైసా ఇవ్వలేదు. 2020లో హైదరాబాద్లో వరదలు వచ్చాయి. అదే సమయంలో గుజరాత్కు రూ.1000 కోట్లు ఇచ్చిన కేంద్రం.. రాష్ర్టానికి రూపాయి కూడా ఇవ్వలేదు. వరద బాధిత తెలంగాణకు కేంద్రం ఈ సారైనా నిధులిస్తుందా? లేక ఖాళీ చెయ్యే విదిలిస్తుందా?
వరద ముంపునకు గురైన ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం బూర్గుపేటకు ఆదివారం పొలంగట్లపై నుంచి నడిచివెళ్తున్న మంత్రి సత్యవతిరాథోడ్, జడ్పీ చైర్పర్సన్ బడే నాగజ్యోతి, రెడ్కో చైర్మన్ ఏరువ సతీశ్రెడ్డి, ఎస్పీ గౌస్ ఆలం తదితరులు
హైదరాబాద్, జూలై 30 (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వం తన స్వార్థ రాజకీయాల కోసం ప్రజలను బలిచేస్తున్నది. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ర్టాల ప్రజలను ఒకలా, ప్రతిపక్ష పార్టీ ప్రభుత్వాలు అధికారంలో ఉన్న రాష్ర్టాల ప్రజలను మరోలా చూస్తున్నది. అందరూ భారతీయులేనన్న కనీస జ్ఞానం మరిచి కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నది. దేశంలో ఏ మూలన ప్రకృతి విపత్తులు సంభవించినా ఆపన్నహ స్తం అందించి ఆదుకోవటం కేంద్ర ప్రభుత్వ విధి. కానీ, భారీ వర్షాలు, వరదల సమయం లో కేంద్రం బీజేపీ పాలిత రాష్ర్టాలతో ఒకలా, ఇతర రాష్ర్టాలతో మరోలా వ్యవహరిస్తున్నది. అందుకు ప్రత్యక్ష ఉదాహరణ తెలంగాణ రాష్ట్రమే. ప్రకృతి వైపరిత్యాలతో తెలంగాణ ప్రజలు అల్లాడుతుంటే సాయం చేసేందుకు మోదీ సర్కారు ససేమిరా అంటున్నది.
దమ్మిడి విదల్చని కేంద్రం
ప్రకృతి వైపరిత్యాలు సంభవించినప్పుడు జాతీయ విపత్తు సహాయ నిధి ద్వారా రాష్ర్టాలకు సాయం చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉంటుంది. కానీ, కేంద్రం తన బాధ్యతను మరిచింది. 2016 సెప్టెంబర్, 2020 అక్టోబర్లో రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలతో రై తులు, ప్రజలు తల్లడిల్లిపోయారు. 2016 లో కురిసిన వర్షాలకు రూ.3,851 కోట్ల నష్టం వాటిల్లినట్టు కేంద్ర బృందం అంచనా వేసింది. 2020లో కురిసిన వర్షాలతో సుమారు రూ.5 వేల కోట్ల నష్టం వాటిల్లిన ట్టు అంచనా వేశారు. ఈ రెండేండ్లలో కలిపి రూ.8,851 కోట్ల నష్టం జరిగింది. అయినా, కేంద్రం నయా పైసా విదిల్చలేదు. కానీ, 2018-19 నుంచి 2021-22 వరకు ఇతర రాష్ర్టాలకు విపత్తు సాయం కింద కేంద్ర ప్రభుత్వం రూ.44,219 కోట్లు విడుదల చేసింది. ఇందులో తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వకపోవడం రాష్ట్రంపై కేంద్ర వివక్షకు నిదర్శనంగా నిలిచింది. ఈ విషయాన్ని సాక్షాత్తు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ పార్లమెంట్ సాక్షిగా గత ఏడాది జూలై 19న వెల్లడించారు.
రాష్ట్రం విన్నపాలు బుట్టదాఖలు
దున్నపోతుపై వానపడ్డట్టు.. వరద సాయంపై రాష్ట్ర ప్రభుత్వం ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా కేంద్రం నుంచి స్పందన కరువైంది. మంత్రులు వెళ్లినా, స్వయంగా సీఎం కేసీఆర్ వెళ్లి విజ్ఞప్తి చేసినా మోదీ సర్కారు పట్టించుకోలేదు. 2020 అక్టోబర్లో హైదరాబాద్లో చరిత్రలోనే అత్యధిక వర్షాపాతం నమోదైంది. దీంతో రూ.5 వేల కోట్ల నష్టం వాటిల్లిందని, తక్షణ సాయంగా రూ.1,350 కోట్లు ఇవ్వాలని ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ లేఖ రాశారు. ఈసారి కూడా కేంద్రం నుంచి కనీస స్పందన రాలేదు. ఢిల్లీ వెళ్లిన సీఎం కేసీఆర్.. కేంద్ర హోంమంత్రి అమిత్షాను కలిసి వరద సాయం చేయాలని కో రారు. కానీ, పైసా కూడా ఇవ్వలేదు.
రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ ఆపన్నహస్తం
రాష్ట్రంలో ప్రకృతి విపత్తులు సంభవించిన ప్రతిసారీ కేంద్ర సాయం కోసం ఎదురుచూడకుండా సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు శ్రీరామ రక్షగా నిలిచారు. 2020లో హైదరాబాద్లో భారీ వరదలు వచ్చినప్పుడు కేంద్రం స్పందించకపోవడంతో సీఎం తక్షణం రూ.650 కోట్లు విడుదల చేసి నష్టపోయినవారికి రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయం చేశారు. గత ఏడాది అకాల వర్షాలతో పంట నష్టం జరిగితే ఎకరాకు రూ. 10వేల చొప్పున రూ.455 కోట్లు రైతులకు పరిహారం అందించారు.
ఇక్కడ కక్ష… అక్కడ పరామర్శ
ప్రకృతి వైపరిత్యాలు, వరదలతో తెలంగాణ ప్రజలు కష్టాల్లో మునిగిపోతే పరామర్శ దేవుడెరుగు.. కనీసం నష్టంపై ఆరా తీసే స మయం కూడా ప్రధాని మోదీకి లేకపోయిం ది. అదే బీజేపీ పాలిత రాష్ర్టాల్లో మాత్రం ఆ యా సీఎంలకు ఫోన్లు చేసి నష్టంపై ఆరా తీసి అభయం ఇచ్చేస్తున్నారు. రోజుల వ్యవధిలోనే సాయం అందిస్తున్నారు. 2021 నవంబర్లో కర్ణాటకలో వరదలు వస్తే నాటి సీఎం బస్వరాజ్ బొమ్మైకి ఫోన్ చేసి పరిస్థితిపై ఆరా తీశారు. నెలలోపే ఎన్డీఆర్ఎఫ్ నుంచి విపత్తు సహాయ నిధులు విడుదల చేశారు.
నేడు రాష్ర్టానికి కేంద్ర బృందం రాక
వరద నష్టాన్ని పరిశీలించనున్న అధికారులు
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వరద సహాయక చర్యలను పరిశీలించేందుకు, వరద నష్టాన్ని అంచనా వేసేందుకు నేడు కేంద్ర బృందం రాష్ర్టానికి రానుంది. ఇంటర్ మినిస్ట్రియల్ సెంట్రల్ టీమ్ రాష్ట్రంలో పర్యటిస్తుందని కేంద్ర హోం శాఖ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. వరద నష్టాన్ని తీవ్ర విపత్తుగా ప్రకటించాలా లేదా అన్న విషయాన్ని ఈ బృం దం నిర్ణయించనుంది. ఎన్డీఆర్ఎఫ్ సలహాదారు కునాల్ సత్యార్థి ఈ బృందానికి నేతృత్వం వహించనున్నారు. వ్యవసాయ, ఆర్థిక, జల్ శక్తి, విద్యుత్తు, రోడ్డు రవాణా శాఖ అధికారులు ఈ బృందంలో సభ్యులుగా ఉంటారు. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు వరద నష్టాన్ని అంచనా వేయనున్న కేంద్ర బృందం కేంద్రం చేయాల్సిన అదనపు సాయం కోసం కూడా సిఫారసు చేసే అవకాశాలు ఉన్నాయి.
బీజేపీ రాష్ర్టాలకు నిధుల వరద