మహబూబాబాద్ : మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో మంత్రి క్యాంప్ కార్యాలయానికి రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ పూజలు చేసి, ప్రారంభోత్సవం చేశారు. ఈ పూజా కార్యక్రమంలో మంత్రి కొడుకులు సునిల్ రాథోడ్, సతీష్ రాథోడ్, కోడళ్ళు సోనమ్ రాథోడ్, బిందు రాథోడ్, అక్కళ్లు, అన్నయ్య, కూతుళ్ళు, మనుమరాళ్లు, కుటుంబ సభ్యులు, బంధువులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ జడ్పీ చైర్పర్సన్ కుమారి బిందు, ఎమ్మెల్యే శంకర్ నాయక్, మున్సిపల్ చైర్మన్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి, జడ్పీటీసి బండి వెంకట్ రెడ్డి, బయ్యారం పీఏసీఎస్ చైర్మన్ మూల మధుకర్ రెడ్డి, టీఆర్ఎస్ నేతలు నూకల రంగారెడ్డి, కొంపల్లి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, కేఎస్ఎన్ రెడ్డి, పరకాల శ్రీనివాస్ రెడ్డి, మాలే నాగేశ్వర రావు, కొమ్మినేని రవీందర్, మన్యు ప్యాట్ని, తాళ్లూరి హనుమ, కాలం రవీందర్ రెడ్డి, నర్సింహా రెడ్డి, బోడ శ్రీను, శ్రావణ్ రెడ్డి, వల్లూరి కృష్ణా రెడ్డి, నాగన్న, జిల్లా కలెక్టర్ శశాంక, అదనపు కలెక్టర్లు అభిలాష అభినవ్, కొమురయ్య, ఎస్పీ కోటిరెడ్డి, డీఎస్పీ సదయ్య, జిల్లా అధికారులు, నేతలు పాల్గొని సత్యవతి రాథోడ్కు శుభాకాంక్షలు తెలిపారు.
మంత్రి క్యాంప్ కార్యాలయం ప్రారంభం కావడంతో సందర్శకులు, స్థానికుల ఫిర్యాదులు, విజ్ఞప్తులు స్వీకరించడానికి అధికారులు ఇక్కడ అందుబాటులో ఉంటూ పని చేస్తారని మంత్రి తెలిపారు.