హైదరాబాద్ : నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్పై మంత్రి సత్యవతి రాథోడ్ మండిపడ్డారు. ఎమ్మెల్సీ కవితపై అరవింద్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు. ఎంపీ స్థానంలో ఉండి అనుచిత వ్యాఖ్యలు చేయడం, అవమానకరంగా మాట్లాడడం అరవింద్ దిగజారుడు చర్యలకు నిదర్శనం అని పేర్కొన్నారు. తెలంగాణకే అవమానకరంగా ఎంపీ అరవింద్ ప్రవర్తన ఉందన్నారు. చాలా సందర్భాల్లో అరవింద్ తన స్థాయి మరిచి మాట్లాడారని గుర్తు చేశారు. సీఎం కేసీఆర్ను అనరాని మాటలు అంటున్నారు. అరవింద్ నోరు అదుపులో పెట్టుకోవాలని సత్యవతి హెచ్చరించారు. నిరాధార ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోమని చెప్పారు.
పార్లమెంట్లో ఎంపీ అరవింద్ తెలంగాణకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై ఏనాడు మాట్లాడలేదన్నారు. పసుపు బోర్డు తెస్తానని బాండ్ పేపర్ రాసిచ్చి రైతులను మోసం చేసిన వ్యక్తి అరవింద్. అలాంటి వ్యక్తి నిరాధారణ ఆరోపణలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఎంపీ అరవింద్ సీఎం కేసీఆర్కు, ఎమ్మెల్సీ కవితకు క్షమాపణ చెప్పాలని సత్యవతి డిమాండ్ చేశారు. రాజకీయంగా పోటీపడుదామని, కానీ చిల్లర రాజకీయాలు మానుకోవాలని బీజేపీ నాయకులకు హితవు పలికారు మంత్రి సత్యవతి రాథోడ్.