ములుగు : ఈ నెల 28 వ తేదీన వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అధికారులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ సమీపంలో మెడికల్ కళాశాల భవన నిర్మాణ కోసం స్థల పరిశీలన చేశారు.
అనంతరం బండారుపల్లి రోడ్ తంగడి మైదానంలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభా స్థలిని మంత్రి పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి,
ఎస్పీ గౌస్ ఆలం, జడ్పీ చైర్ పర్సన్ బడేనాగ జ్యోతి, పల్లా బుచ్చయ్య, ఆర్డీవో సత్యపాల్ రెడ్డి, ఎంపీపీ గండ్రకోట శ్రీదేవి, జడ్పీటీసీ హరిబాబు, డీపీవో వెంకయ్య, కలెక్టరేట్ ఏఓ ప్రసాద్, ములుగు తహసిల్దార్ విజయ భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.