మహబూబాబాద్ : రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం, నీళ్లు, నిధులు, నియామకాలకు పెద్దపీట వేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్(Minister Sathyavathi) అన్నారు. గూడూరు మండల కేంద్రంలో బీఆర్ఎస్ మండల బూత్ కమిటీల విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొన్నారు. ఇటీవల మృతి చెందిన పొనుగోడు గ్రామ సర్పంచ్ నలమాస వెంకన్న చిత్రపటానికి మంత్రి పూలమాల వెలిసి నివాళులు అర్పించి మాట్లాడారు.
67 ఏళ్లు పాలించిన కాంగ్రెస్, తొమ్మిదేళ్లుగా కేంద్రంలో పాలిస్తున్న బీజేపీ తెలంగాణకు చేసిందేమీ లేదన్నారు. గత ప్రభుత్వాల పాలనలో కరెంట్ లేక అటు రైతులు, ఇటు ప్రజలు తీవ్ర ఇబ్బందిపడ్డారు. మళ్లీఅ అలాంటి పరిస్థితిలు రావద్దు అంటే బీఆర్ఎస్ను భారీ మెజారిటీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత మన అందరి పైన ఉందన్నారు. గత పాలకులు గిరిజనులను ఓటు బ్యాంకుగా మాత్రమే చూశారే తప్పా అభివృద్ధి చేయలేదు.
తండాలను గ్రామ పంచాయతీలు చేసి, గిరిజనులకే పాలించుకునే అవకాశం కల్పించిన గొప్ప నేత కేసీఆర్ అన్నారు. ప్రజలందరూ సీఎం కేసీఆర్ పక్షాన నిలబడి మరోమారు సీఎం చేయాలని పేర్కొన్నారు. మహబూబాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి శంకర్ నాయక్ ప్రజల్లో ఉండి, నియోజక అభివృద్ధి కోసం కృషి చేసారు.
మరోసారి శంకర్ నాయక్ణను గెలిపించుకొని ఈ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసుకుందామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా జడ్పీ చైర్పర్సన్ ఆంగోత్ బిందు, బీఆర్ ఎస్ రాష్ట ప్రధాన కార్యదర్శి నూకల నరేష్ రెడ్డి, రాష్ట్ర నాయకులు బీరెల్లి భరత్ కుమార్ రెడ్డి, జిల్లా కోఆప్షన్ సభ్యుడు ఖాసిం, మండల పార్టీ అధ్యక్షుడు వేం కృష్ణారెడ్డి, సోషల్ మీడియా ఇన్చార్జి నరసింహ నాయక్ పాల్గొన్నారు.