యాదాద్రి భువనగిరి : యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామిని ఆదివారం గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు వారికి ప్రత్యేక స్వాగతం పలికి.. ఆశీర్వచనం చేశారు.
కరోనా మహమ్మారి నుంచి ప్రజలకు విముక్తి కల్పించాలని స్వామివారిని ప్రార్థించినట్లు మంత్రి తెలిపారు. ప్రజలంతా ఆయురారోగ్యాలతో.. పాడిపంటలతో సుభిక్షంగా ఉండాలని నారసింహుడిని కోరుకున్నామన్నారు.