మహబూబాబాద్ : సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలోని ఆలయాల పున:ప్రతిష్ట ఎంతో వైభవంగా కొనసాగుతున్నది. కొందరు దేవుడు వారికి మాత్రమే సొంతం అనే విధంగా మాట్లాడుతున్నారు అది సరికాదు అని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. సోమవారం మరిపెడ మండలం బాల్ని ధర్మారం గ్రామంలో జరుగుతున్న బొడ్రాయి ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొని మాట్లాడారు.
రూ.1200 కోట్లతో యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం మరో తిరుపతి ఆలయంగా రూపొందించిన ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు. గ్రామాల్లో సంస్కృతి, సంప్రదాయాలు కాపాడేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన సూచించారు.ఎప్పుడూ ఆధ్యాత్మిక కాంతితో వెలుగొందే బాల్నిధర్మారం మరింత అబివృద్ది చెందాలన్నారు.ధర్మారం గ్రామ అభివృద్ధికి 10 లక్షల రూపాయలు నిధులను కేటాయించారు.
కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూకల నరేష్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు శ్రీరంగ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, మధుకర్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి,యువ నాయకులు అభినవ్,అశోక్, రామ్ లాల్, శ్రీరామ్, వేణుగోపాల్ రెడ్డి, కలం రవీందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.