కందుకూరు : పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేసి ప్రతి ఎకరాకు నీరందించడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి (Minister Sabitha Indrareddy) తెలిపారు. బుధవారం మండల పరిధిలోని అన్నోజిగూడ గ్రామంలో రూ. 20లక్షలతో నిర్మించనున్న పంచాయతీ భవనానికి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. సీఎం కేసీఆర్(CM KCR), మంత్రి కేటీఆర్(Minister KTR) లు ఇచ్చిన హమీ మేరకు రూ. 6600 కోట్ల తో కందుకూరు ఫార్మాసిటీ వరకు మెట్రో, రూ. 200కోట్లతో వంద పడకల ఆసుపత్రి మంజూరయ్యిందని పేర్కొన్నారు. ఫార్మాసిటీ ఏర్పాటుతో ఉపాధి హామీ, ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పారని అందుకోసం సీఎం కేసీఆర్ పాలన తిరిగి రావాలని ఆమె కోరారు.
సీఎం కేసీఆర్ మనసున్న మహారాజని అన్నారు. ఫార్మాసిటీలో భూములు కోల్పోయిన రైతులకు న్యాయం చేస్తానని తెలిపారు. భవిష్యత్ తరాలకు ఉపయోగ పడేవిధంగా పాలనను అందిస్తున్నట్లు వెల్లడించారు. ఆర్టీసీ, ఉద్యోగులతో పాటు వీఆర్ఏ (VRS) లను ఉద్యోగులుగా ప్రభుత్వం గుర్తించదని చెప్పారు. ప్రతిపక్షాల మాటలను నమ్మవద్దని సూచించారు. కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి, సర్పంచ్ కాకి ఇందిమ్మ దశరథ్ ముదిరాజ్, ఎంపీపీ మంద జ్యోతి పాండు, వైఎస్ ఎంపీపీ గంగుల శమంత ప్రభాకర్రెడ్డి. మార్కెట్ చైర్మన్ సురుసాని సురేందర్రెడ్డి, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు సురుసాని రాజశేఖర్రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.