కందుకూరు(రంగారెడ్డి) : బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నాయకులు అధికార దాహంతో బీఆర్ఎస్(BRS) ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి(Minister Sabitha Indrareddy) విమర్శించారు. రంగారెడ్డి జిల్లా (Rangareddy District) కందుకూరు మండలం ముచ్చర్ల గేటు వద్ద బీఆర్ఎస్ పార్టీ జెండాను ఆమె ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు.
సీఎం కేసీఆర్(CM KCR) పాలనను ప్రజలు కోరుకుంటున్నారని, దేశంలో బీఆర్ఎస్ పార్టీకి తిరుగేలేదని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ చూసి ప్రతి పక్షాలు భయపడుతున్నాయని అన్నారు. ప్రభుత్వ పథకాలు ఇంటింటికి చేరుతున్నాయని చెప్పారు. పార్టీ కోసం పని చేసే వారిని తగిన విధంగా గుర్తిస్తామని తెలిపారు.
ప్రజల అండ ఉన్నంత వరకు బీఆర్ఎస్ను ఎవరూ, ఏమి చేయలేరని వెల్లడించారు. కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా పరిషత్చైర్పర్సన్ తీగల అనితారెడ్డి, జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి, మార్కెట్ చైర్మన్ సురుసాని సురేందర్రెడ్డి, పీఎసీఎస్ చైర్మన్ దేవరశెట్టి చంద్రశేఖర్, మండల పార్టీ అధ్యక్షుడు మన్నే జయేందర్ ముదిరాజ్, సీనియర్ నాయకులు, కార్యకర్తలు,పాల్గొన్నారు.