హైదరాబాద్, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ప్రతి జిల్లాకు ఒక నవోదయ విద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని, రాష్ర్టానికి వైద్య కళాశాలలను మంజూరు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.
ప్రతి జిల్లాకు ఒక నవోదయ పాఠశాల ఏర్పాటుచేయాలని కేంద్రానికి విన్నవించినా, సీఎం కేసీఆర్ స్వయంగా ఉత్తరాలు రాసినా దున్నపోతు మీద వాన పడ్డట్టుగా వ్యవహరిస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ తీర్మానాన్ని ఎక్సైజ్, టూరిజంశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ బలపరిచారు. సీఎం కేసీఆర్ లేకుంటే తెలంగాణ గర్వపడేలా మన అందరం తలెత్తుకొని తిరిగేవారమే కాదని అన్నారు.