వనపర్తి : కండ్ల ముందే వనపర్తి జిల్లా అభివృద్ధి కనిపిస్తుదని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. వనపర్తి జిల్లా కేంద్రంలో పలు అభివృద్ధి పనులకు పలువురు మంత్రులతో కలిసి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. మంత్రి నిరంజన్రెడ్డి ఏది మాట్లాడినా దాని వెనుక ప్రజల ప్రయోజనం ఉంటుందన్నారు. వనపర్తి ప్రజలు భవిష్యత్లో సీఎం కేసీఆర్, మంత్రి నిరంజన్రెడ్డిని తప్పకుండా గుర్తు పెట్టుకుంటారన్నారు. బీసీ మహిళా డిగ్రీ కళాశాలలో వ్యవసాయ కోర్సు ప్రవేశపెట్టడం అభినందనీయమన్నారు.
అందరు సమన్వయంతో పని చేయడం ద్వారానే తెలంగాణ అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. రాష్ట్రంలో 1,153 జూనియర్ గురుకుల కళాశాలలు ఉన్నాయని, రూ.20 లక్షల ఓవర్సీస్ స్కాలర్ షిప్ ఇచ్చి విద్యార్థులను చదివిస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమేనన్నారు. రూ.3500 కోట్లతో ‘మన ఊరు – మనబడి’ కింద అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయన్నారు. నీళ్లు తెచ్చి.. నీళ్ల నిరంజన్రెడ్డిగా పేరు తెచ్చుకున్నారని.. ఇన్ని విద్యాసంస్థలు తెచ్చినందుకు ఇంకో పేరు పెట్టాలని అన్నారు. పోటీని తట్టుకునేందుకు ఆంగ్ల విద్య తప్పనిసరి భావించిన తెలంగాణ ప్రభుత్వం.. మేరకు ప్రోత్సహిస్తుందన్నారు.
ఏడు దశాబ్దాల స్వతంత్ర భారతదేశంలో 60 శాతం ఉన్న బీసీలను విద్యకు దూరం చేశారని మంత్రి గంగుల
విమర్శించారు. చదువులో బీసీలు వెనుకబడలేదని, వెనుకపడేయబడ్డారన్నారు. చదువు అందుబాటులోక
కులవృత్తుల్లోనే ఉపాధిని వెతుకున్నారన్నారు. తెలంగాణ రాక ముందు తెలంగాణ 19 బీసీ గురుకులాలు మాత్రమే ఉండేవని, ఆర్థిక ఇబ్బందులతో తల్లిదండ్రులు బిడ్డలను ఉన్నత విద్యకు దూరం చేశారన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ 310 బీసీ గురుకులాలు ఏర్పాటు చేశారన్నారు. ఈ బిడ్డలు తెలంగాణ ఆస్తి అని, వారిని సీఎం కేసీఆర్ చదివిస్తున్నారన్నారు.
దేశంలో ప్రథమంగా డిగ్రీ గురుకుల కళాశాలలు ఏర్పాటు చేశారని, ఆస్తులమ్ముకుని పిల్లలను చదివించుకునే దుస్థితిని కేసీఆర్ తప్పించారన్నారు. భవిష్యత్ ఉపాధి, ఉద్యోగ అవకాశాలను దృష్టిలో పెట్టుకుని కొత్త కోర్సులను డిగ్రీ కళాశాలల్లో ప్రవేశపెట్టినట్లు తెలిపారు. ఎంపీ పోతుగంటి రాములు మాట్లాడుతూ వనపర్తి.. వనరులపర్తి అని, త్వరలో వనపర్తి, నాగర్ కర్నూలు, గద్వాలకు కేంద్రీయ విద్యాలయాలు తీసుకువస్తామన్నారు. భవిష్యత్లో ఇతర ప్రాంతాలకు వనపర్తి ఆదర్శంగా నిలుస్తుందన్నారు.