అక్కడి పథకాలపై మంత్రులు సత్యవతి రాథోడ్, సబితా ఇంద్రారెడ్డి ఆరా
హైదరాబాద్, జూన్ 27 (నమస్తే తెలంగాణ): మహారాష్ట్రలోని ఉస్మానాబాద్ జిల్లా తుర్జాపూర్ మండలం మంగరుల్ అంగన్వాడీ కేంద్రాన్ని తెలంగాణ స్త్రీ, శిశు, గిరిజన సంక్షేమశాఖల మంత్రి సత్యవతి రాథోడ్, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సోమవారం సందర్శించారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా అమలవుతున్న పథకాలు, విద్యార్థుల పౌష్టికాహారం, బాలింతల కిట్ల వివరాల గురించి అడిగి తెలుసుకొన్నారు.
రాష్ట్రంలో అమలుచేస్తున్న కేసీఆర్ కిట్లు, ఆరోగ్యలక్ష్మి పథకాలపై మంత్రి సత్యవతి మహారాష్ట్ర అధికారులకు వివరించారు. తెలంగాణలోని అంగన్వాడీ టీచర్లకు దేశంలో ఎకడా లేని విధంగా అత్యధిక గౌరవ వేతనం ఇస్తున్నట్టు తెలిపారు. కొత్తగా ఆంగ్ల బోధన ప్రవేశపెట్టడంతో అంగన్వాడీ కేంద్రాలు ప్రీ సూళ్లుగా మారాయని వివరించారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో సంక్షేమ పథకాల అమలుపై మహారాష్ట్ర అధికారులు, సిబ్బంది హర్షం వ్యక్తం చేశారని మంత్రి సత్యవతి చెప్పారు.