వికారాబాద్ : తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మానవత్వం చాటుకున్నారు. రోడ్డుప్రమాదంలో గాయపడిన ఓ యువకుడిని తన కాన్వాయ్లోని పోలీసు వాహనంలో ఆస్పత్రికి తరలించేలా చర్యలు తీసుకున్నారు. వికారాబాద్ డెంటల్ హాస్పిటల్ సమీపంలో వేగంగా వచ్చిన ఓ కారు.. బైక్ను ఢీకొట్టింది. అదే సమయంలో అటుగా వెళ్తున్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి, రోడ్డుప్రమాదాన్ని గుర్తించి తన కాన్వాయ్ను ఆపారు. అనంతరం క్షతగాత్రుడిని తన కాన్వాయ్లోని పోలీసు వాహనంలో వికారాబాద్ ఆస్పత్రికి పంపించారు. క్షతగాత్రుడికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు.