హైదరాబాద్ : గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్తో సాయంత్రం 5 గంటలకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమావేశం కానున్నారు. రాజ్ భవన్లో జరిగే ఈ భేటీలో ఉన్నత విద్యాశాఖ అధికారులు కూడా పాల్గొననున్నారు. తెలంగాణలోని యూనివర్సిటీల ఉమ్మడి నియామక బోర్డుపై గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్కు ఉన్న సందేహాలను సబితా ఇంద్రారెడ్డి నివృత్తి చేయనున్నారు. వర్సిటీల ఉమ్మడి నియామక బోర్డుపై న్యాయపరమైన అన్ని అంశాలను గవర్నర్కు వివరిస్తామని తెలిపారు.