ఖమ్మం/ రఘునాథపాలెం, అక్టోబర్ 3: బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్లీ గెలిస్తేనే అర్హులందరికీ అభివృద్ధి, సంక్షమ పథకాలు అందుతాయని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్(Minister Puvwada )స్పష్టం చేశారు. ఈ అభివృద్ధి కొనసాగాలంటే మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వానికే పట్టం కట్టాలని పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్తోనే రాష్ట్ర సమగ్రాభివృద్ధి సాధ్యమని స్పష్టం చేశారు. ఇల్లులేని నిరుపేదలు సొంతింట్లో ఆత్మగౌరవంతో జీవించాలనే సంకల్పంతోనే రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్ రూం ఇళ్ల పథకానికి శ్రీకారం చుట్టిందని అన్నారు.
ఖమ్మం వైఎస్ఆర్నగర్లో రూ.5.08 కోట్లతో నిర్మించిన 91 డబుల్ బెడ్ రూం ఇళ్లను, నూతన ప్రభుత్వ పాథమిక పాఠశాలను కలెక్టర్ వీపీ గౌతమ్తో కలిసి మంత్రి అజయ్ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ డబుల్ బెడ్ రూం ఇళ్ల లోపలికి వెళ్లి నాణ్యతను, డిజైన్ను, సౌకర్యాలను పరిశీలించారు.
అనంతరం ఏమంత్రి మాట్లాడుతూ.. తెలంగాణలోని నిరుపేదలందరూ ఆత్మగౌరవంతో బతికేందుకు వారికి గూడు కల్పించడమే సీఎం కేసీఆర్ ఉద్దేశమని స్పష్టం చేశారు. దీంతో పేదల సొంతింటి కల సాకారమవుతోందని అన్నారు. నయా పైసా ఖర్చు లేకుండా ప్రభుత్వం అందించిన ఈ ఇళ్లను లబ్ధిదారులకు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఖమ్మం నగరంలోని పలు డివిజన్లలో రూ.2.48 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ మంగళవారం శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. 4, 30, 51, 52 డివిజన్లలో చేపట్టిన సీసీ రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణాలకు మంత్రి శంకుస్థాపనలు చేశారు. 34వ డివిజన్ రంగనాయకుల గుట్ట నిర్మించిన కొండా లక్ష్మణ్ బాపూజీ పారు ప్రారంభించారు. స్పోర్ట్స్ కిట్లు, టీ షర్టులు పంపిణీ చేశారు. ఈ కార్యకమంలో పునుకొల్లు నీరజ, కూరాకుల నాగభూషణం, బచ్చు విజయ్కుమార్, బీ.సత్యప్రసాద్, ఆదర్శ్ సురభి తదితరులు పాల్గొన్నారు.