భద్రాద్రి కొత్తగూడెం : రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భద్రాచలం ప్రధాన రహదారికి ఇరువైపులా విప్ రేగా కాంతారావుతో కలిసి మంత్రి పువ్వాడ అజయ్ మొక్కలు నాటారు. అనంతరం భద్రాచలం వెటర్నరీ ప్రాంగణంలో రూ. 6.98 లక్షలతో నిర్మించిన పబ్లిక్ టాయిలెట్స్, రూ. 16.91 లక్షలతో ఏర్పాటు చేసిన ప్రకృతి వనాన్ని ప్రారంభించారు. దుమ్ముగూడెం మండలం కేంద్రంలో పర్యటించిన మంత్రి అజయ్ కుమార్.. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద మొక్కలు నాటారు. అక్కడ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మాలోత్ కవిత, జిల్లా కలెక్టర్ అనుదీప్, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, ఐటీడీఏ పీవో గౌతమ్, ఎస్పీ సునీల్ దత్, అదనపు ఎస్పీ వినీత్, అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లుతో పాటు అటవీ, రెవెన్యూ, పంచాయతీ అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.