హైదరాబాద్ : రాష్ట్ర రవాణా శాఖపై ఆ శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ బుధవారం సమీక్ష నిర్వహించారు. ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ వీసీ సజ్జనార్, ఈడీలతో అజయ్ కుమార్ సమీక్షిస్తున్నారు. ప్రధానంగా ఆర్టీసీ ఛార్జీల పెంపుపై చర్చిస్తున్నారు. ఛార్జీల పెంపు ప్రతిపాదనను గత నెలలోనే సీఎం కేసీఆర్కు నివేదించామని చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ తెలిపారు. ఆర్డినరీ బస్సుల్లో కిలోమీటర్కు 20 పైసలు, ఇతర బస్సుల్లో కిలోమీటర్కు 30 పైసలు పెంచాలని ప్రతిపాదించామని ఆయన పేర్కొన్నారు.