ఖమ్మం : ఖమ్మం నగరం గట్టయ్య సెంటర్లో రూ.14 కోట్లతో నూతనంగా నిర్మిస్తున్న మున్సిపల్ భవనం, తెలంగాణ తల్లి విగ్రహం వద్ద రూ.2 కోట్లతో నిర్మిస్తున్న బీసీ భవన్ నిర్మాణ పనులను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పరిశీలించారు. పనుల అలసత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పనుల్లో నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తున్నారని గుత్తేదారుడిపై అసహనం వ్యక్తం చేశారు.
ఇప్పటికే పూర్తి చేసి వినియోగంలోకి తేవాల్సి ఉండగా ఇంకా పనులు చేస్తూనే ఉన్నారా అని ప్రశ్నించారు. సాధ్యమైనంత త్వరగా పనులు వేగం పెంచాలని ఆదేశించారు. కార్యక్రమంలో మేయర్ పునుకొల్లు నీరజ, జడ్పీ చైర్మన్ కమల్ రాజ్ , సుడా చైర్మన్ విజయ్ అధికారులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
ఆమె ఫిర్యాదుతో సువేందు అధికారిపై కేసు నమోదు
మొక్కల సంరక్షణ బాధ్యత స్థానిక సంస్థలదే
నేరేడ్మెట్ పోలీసు స్టేషన్కు గద్దర్
రౌడీ బేబి వీడియో సాంగ్ సెన్సేషనల్ రికార్డు