హైదరాబాద్, నవంబర్ 30 (నమస్తే తెలంగాణ): నూతన సచివాలయ నిర్మాణ పనులన్నింటినీ నెల రోజుల్లోగా పూర్తి చేయాలని ఆర్అండ్బీ శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి సంబంధిత అధికారులను, ఆ పనులు చేపట్టిన సంస్థను ఆదేశించారు. అన్ని అంతస్తుల్లో ఫాల్స్ సీలింగ్, ఇతర ఫినిషింగ్ పనులను ఏకకాలంలో చేపట్టి త్వరగా పూర్తిచేయాలని సూచించారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పట్ల సీఎం కేసీఆర్కు అపార గౌరవం ఉన్నదని, అందుకే అందుకే నూతన సచివాలయానికి ఆయన పేరు పెట్టారని మంత్రి తెలిపారు. సీఎం ఆదేశాల మేరకు బుధవారం ఆయన నూతన సచివాలయ నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించారు.
దాదాపు మూడున్నర గంటలపాటు ఆ ప్రాంగణమంతా కలియదిరిగారు. అనంతరం ఆర్అండ్బీ అధికారులతోపాటు, నిర్మాణ సంస్థ ప్రతినిధులతో అక్కడే సమీక్షా సమావేశం నిర్వహించారు. బ్లాకులవారీగా అన్ని పనులను సమాంతరంగా మూడు షిఫ్టుల్లో నిర్వహించాలని ఆదేశించారు. అవసరమైతే కార్మికుల సంఖ్యను పెంచాలని సూచించారు. రెడ్ సాండ్స్టోన్, క్లాడింగ్ పనులతోపాటు ప్రధాన ద్వారం, పోర్టికో, మెట్ల మార్గం, అన్ని అంతస్తుల్లో ఫ్లోరింగ్ పనులను త్వరగా పూర్తిచేయాలని స్పష్టం చేశారు. మెయిన్ గ్రాండ్ ఎంట్రెన్స్, ఫౌంటెన్ నిర్మాణం, డోమ్స్, ఎలక్ట్రికల్ వర్స్తోపాటు బ్లాకులవారీగా జరుగుతున్న ఫినిషింగ్ పనులపై అధికారులతో కూలంకషంగా చర్చించారు. సమావేశంలో ఆర్అండ్బీ ఈఎన్సీ గణపతిరెడ్డి, ఎస్ఈలు సత్యనారాయణ, లింగారెడ్డి, ఈఈ శశిధర్, వాస్తు నిపుణులు సుధాకర్ తేజ, ఆరిటెక్ట్ ఆసార్ పొన్ని, పలువురు అధికారులు, వర్ ఏజెన్సీ ప్రతినిధులు పాల్గొన్నారు.