సిద్దిపేట : ఎన్నికలకు ముందు రాజకీయాలు.. ఎన్నికల తరువాత రాజకీయాలు లేవని అభివృద్ధి పనులు చేపడుతామని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam )అన్నారు. బుధవారం హుస్నాబాద్(Husnabad) పట్టణంలో 18.50 కోట్ల వ్యయంతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. హుస్నాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో అభివృద్ధి పనులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..హుస్నాబాద్లో తాగు నీటి కోసమే 3.5 కోట్లు మంజూరు చేశామన్నారు. మున్సిపాలిటీలో ఎలాంటి సమస్య లేకుండా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఎలాంటి ఇబ్బందులూ ఉన్న మా దృష్టికి తీసుకురావాలని..హుస్నాబాద్ను మరింత అభివృద్ధి చేసేందుకు పని చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ మిక్కిలినేని మనుదీప్ చౌదరి, మున్సిపాలిటీ చైర్ పర్సన్ ఆకుల రజిత, తదితరులు పాల్గొన్నారు.