హుస్నాబాద్: యువత చెడు మార్గంలో వెళ్లకుండా క్రీడలు చక్కగా ఉపయోగపడుతాయని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పోతారంలో జిల్లా స్థాయి కబడ్డి పోటీల్లో మంత్రి పొన్నం పాల్గొన్నారు. క్రీడాకారులతో కలిసి కబడ్డి ఆడారు. ఈ క్రమంలో కూతకు వెళ్లిన ఆయన కాలుజారిపడ్డారు. దీంతో అక్కడే ఉన్నవారు మంత్రిని పైకిలేపారు. ఆయనకు ఎలాంటి గాయం కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కాగా, ఆ తర్వాత కూడా మంత్రి హుషారుగా కబడ్డి ఆడారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ.. చిన్నతనంలో తానుకూడా కబడ్డీ ఆడేవాడినని చెప్పారు. అందుకే క్రీడాకారులను ఉత్సాహ పరిచేందుకు పోటీలకు వచ్చానని చెప్పారు. నిర్వాహకులను అభినందించారు.
కబడ్డీ ఆడిన మంత్రి పొన్నం ప్రభాకర్ pic.twitter.com/t8i0pWd5xq
— Telugu Scribe (@TeluguScribe) March 11, 2024