ప్రభుత్వ ఆధ్వర్యంలో 9న నిర్వహించనున్న తెలంగాణతల్లి విగ్రహా విషరణ కార్యక్రమానికి రావాల్సిందిగా ప్రధాన ప్రతిపక్ష నేత, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను మంత్రి పొన్నం ప్రభాకర్ శనివారం ఆహ్వానించారు. ఎర్రవల్లిలోని కేసీఆర్ నివాసానికి వెళ్లిన పొన్నం బృందం కేసీఆర్కు ఆహ్వాన పత్రిక అందజేసింది.
హైదరాబాద్, డిసెంబర్ 7 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో 9న జరగనున్న తెలంగాణతల్లి విగ్రహావిషరణ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా ప్రధాన ప్రతిపక్ష నేత, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ను రాష్ట్ర బీసీ సంక్షేమం, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆహ్వానించారు. శనివారం ఎర్రవెల్లిలోని కేసీఆర్ నివాసానికి వెళ్లిన పొన్నం బృందానికి మాజీ ఎంపీ సంతోష్కుమార్, మాజీ ఎమ్మెల్యే జీవన్రెడ్డి, బీఆర్ఎస్ నేతలు వంశీధర్రావు తదితరులు స్వాగతం పలికారు.
తన నివాసానికి వచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్కు కేసీఆర్ ఆతిథ్యమిచ్చారు. అందరూ కలిసి భోజనం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సందర్భంగా ఢిల్లీ కేంద్రంగా జరిగిన ఉద్యమ జ్ఞాపకాలను ఇరువురు నేతలు నెమరువేసుకున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ వెంట ప్రభుత్వ ప్రొటోకాల్, ప్రజాసంబంధాల సలహాదారు హరర వేణుగోపాల్, డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రొటోకాల్ డైరెక్టర్ వెంకట్రావు తదితరులున్నారు.