హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ పార్టీ(BJP) ఏం చేసిందో చెప్పాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) అన్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తామని చెప్పారు. రైతులకు బోనస్ తప్పకుండా ఇస్తామని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటునే ప్రధాని మోదీ అపహాస్యం చేశారని గుర్తు చేశారు. రాష్ట్రానికి బీజేపీ పార్టీ ఏ ఒక్క ప్రాజెక్ట్ను తీసుకురాలేదని ఆరోపించారు. అలాంటి పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో(Parliament elections) గట్టిగా బుద్ధి చెప్పాలన్నారు.