రాజన్న సిరిసిల్ల : రాముడి జన్మ ఎక్కడైనా అని అడిగే మూర్ఖుడు ఉన్నాడా? రాముని పేరు చెప్పి ఓట్లు ఆడుకుంటున్నారు. మార్కెటింగ్ చేసుకుంటున్నారు. రాముడి గురించి తప్పుగా మాట్లాడితే సజీవ దహనానికి సిద్ధమని బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్( Ponnam Prabhakar) అన్నారు. బుధవారం వేములవాడ మండలం నాంపల్లి శ్రీలక్ష్మీ నరసింహ స్వామిని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్తో కలిసి దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. బండి సంజయ్( Bandi Sanjay) అమ్మకు పుట్టినవా అని అన లేదు అంటున్నాడు. అమ్మను రాజకీయాల్లోకి తీసుకువచ్చింది ఎవరని ప్రశ్నించారు. హుస్నాబాద్ అంబేద్కర్ విగ్రహం వద్ద బతికున్న మా అమ్మను పట్టుకొని తప్పుగా మాట్లాడావు. మా అమ్మ ఆత్మ ఘోషిస్తుంది వెధవ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఐదేళ్లలో కరీంనగర్ ఎంపీగా చేసిన అభివృద్ధిపై చర్చకు రమ్మంటే రావడం లేదన్నారు. హిందువుని చెప్పు కుంటున్న బండి సంజయ్ వేములవాడ దేవస్థానానికి ఏం చేశాడో చెప్పాలని డిమాండ్ చేశారు. దండం పెట్టి అడుగుతున్న.. అందరిని కోరుతున్న ఈ మూర్ఖుడు ఐదేళ్లలో కరీంనగర్ పార్లమెంట్ నియోజవర్గానికి ఏం చేశాడో నిలదీయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.