హుజూరాబాద్/ తిమ్మాపూర్, ఏప్రిల్ 18 : ‘ప్రధాని మోదీ ఓ మానవ మృగం, రాహుల్గాంధీ మానవతావాది.. రాముడి పేరుతో బీజేపీ రాజకీయం చేస్తున్నది.. తెలంగాణ అంటే భగ్గునమండే మోదీకి ఇక్కడ ఓట్లు అడిగే హక్కు లేదు’ అని మంత్రి పొన్నం ప్రభాకర్ ఘాటు వ్యాఖ్య లు చేశారు. కరీంనగర్ శివారు అల్గునూరు, హుజూరాబాద్లో గురువారం జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశాల్లో ఆయన మాట్లాడారు. పదేండ్లుగా కేంద్రం లో అధికారంలో ఉన్నా తెలంగాణకు బీజేపీ ఒరగబెట్టిందేమీ లేదని, విభజన హామీలను నేటికీ అమలు చేయలేదని విమర్శించారు. రా ష్ర్టానికి ఏమీ చేయని బీజేపీ, ఇక్కడ ఏ ము ఖం పెట్టుకొని ఓట్లు అడుగుతుందని ప్రశ్నించారు. రాము డి ఫొటో పెట్టుకొని ఓట్లు అడగడం కాదని, కరీంనగర్ జిల్లాలోని ఇల్లందకుంట రామాలయాన్ని ఎందుకు అభివృద్ధి చేయలేదో జవాబు చెప్పిన తర్వాతే ఓట్లడగాలని నిలదీశారు. మోదీ పాలనలో కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా శాంతి లేదని ఆరోపించారు. సమావేశాల్లో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, హుజూరాబాద్, కరీంనగర్ నియోజకవర్గ ఇన్చార్జిలు వొడితెల ప్రణవ్, పురమల్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.