వేములవాడ రూరల్, ఫిబ్రవరి 28: బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సం జయ్ ఓ వెధవ అని రవాణా శాఖ మంత్రి పొ న్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు. రాముడి పేరు చెప్పి ఓట్ల వ్యాపారం చేసుకుంటున్నది బండి సంజయ్ అని దుయ్యబట్టారు. రాముడి గు రించి తప్పుగా మాట్లాడితే తాను సజీవ దహనానికి సిద్ధమని స్పష్టం చేశారు. వేములవాడ మున్సిపల్ పరిధిలోని నాంపెల్లి గుట్టపైన శ్రీ లక్ష్మీనర్సింహాస్వామికి బుధవారం ఆయన ప్ర త్యేక పూజలు చేశారు. అనంతరం కొడుముంజలో శ్రీరేణుకా ఎల్లమ్మ ఆలయం, మల్లిఖార్జునస్వామి ఆలయాలకు ప్రభుత్వవిప్ ఆది శ్రీనివాస్తో కలిసి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ.. హుస్నాబాద్ అంబేద్కర్ విగ్రహం వద్ద బతికున్న తన తల్లిని పట్టుకొని సంజయ్ తప్పుగా మాట్లాడారని చెప్పారు.
తల్లి ఎవరికైనా తల్లేనని, తల్లులను రాజకీయాల్లోకి బండి లాగారని, తన తల్లి బాధపడుతున్నదని పేర్కొన్నారు. ఇన్నేం డ్ల రాజకీయజీవితం లో వేములవాడ మాజీ ఎమ్మెల్యే రమేశ్బాబుతో విభేదాలు న్నా.. ఏనాడూ తాము వ్యక్తిగతంగా కుటుంబాలను విమర్శించుకోలేదని గుర్తుచేశారు. ఐ దేండ్లలో బండి ఎంపీగా చేసిన అభివృద్ధిపై చర్చకు రమ్మంటే రావడం లేదని విమర్శించా రు. హిందువుని చెప్పుకుంటున్న బండి సం జయ్ వేములవాడ దేవస్థానానికి ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ‘దండం పెట్టి అడుగుతున్న.. అందరినీ కోరుతున్న.. బండి సంజయ్ గత ఐదేండ్లలో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఏమీ చేయలేదు. దయచేసి ఆ మూర్ఖుడికి ఓటు వేయద్దు’ అని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మం డలాధ్యక్షుడు పిల్లి కనకయ్య, వేములవాడ పట్టణాధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్, చందుర్తి జడ్పీటీసీ నాగం కుమార్, కాంగ్రెస్ జిల్లా ఉ పాధ్యక్షుడు ఎర్రం రాజు పాల్గొన్నారు.