రాజన్న సిరిసిల్ల : శ్రీదత్తాత్రేయ స్వామి(Dattatreya Swamy) ఆశీస్సులతో ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు నెర వేరుస్తుందని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) పేర్కొన్నారు. బుధవారం దత్తాత్రేయ స్వామి జయంతి ఉత్సవాలలో భాగంగా వరదవెల్లి దత్తాత్రేయ స్వామి దేవాలయంకు చేరుకుని స్వామి వారికి ప్రభుత్వ విప్ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, కవ్వంపల్లి సత్యనారాయణతో కలిసి పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ..తమ ప్రభుత్వం పై స్వామి వారి ఆశీస్సులు ఉండాలన్నారు. భవిష్యత్తులో దత్తాత్రేయ స్వామి ఆలయాన్ని గొప్ప ఆధ్యాత్మిక క్షేత్రంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. స్వామి వారికి నిత్యపూజలు, పూజారులు, భక్తులు దర్శనం చేసుకునేలా ప్రతి రోజు బోట్ సౌకర్యం కల్పిస్తామని పేర్కొన్నారు. మంత్రి వెంట స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు ఉన్నారు.