హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును(Telangana formation) ప్రధాని మోదీ (PM Modi) అవ మానించారని (Insulting) బీసీ సంక్షే౦మ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) అన్నారు. విభజన చట్టంలోని హామీలను సైతం కేంద్ర ప్రభుత్వం నెరవేర్చలేదని విమర్శించారు. మోదీ చెప్పిన ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయని? ప్రశ్నించారు.
బీజేపీ మత భావోద్వేగాలతో రాజకీయాలు చేస్తున్నదని విమర్శించారు. మోదీ, అమిత్ షా కలిసి దేశంలోని నవరత్న సంస్థలను అమ్మారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నల్లసాగు చట్టాలు రైతుల ఆత్మ హత్యలకు కారణమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీకి ఓటుతో బుద్ధి చెప్పాలన్నారు.