హైదరాబాద్, ఫిబ్రవరి 17 (నమస్తే తెలంగాణ): కాళేశ్వరం ప్రాజెక్టును బాగు చేయడంపై తమ ప్రభుత్వం తొందరపడదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అన్నారు. శనివారం ఆయన శాసనసభలో మాట్లాడు తూ రీడిజైన్ల కారణంగానే ఈ పరిస్థితి ఏ ర్పడిందని చెప్పారు. ఒకప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టును దేవాలయంగా సంబోధించిన కేసీఆర్.. నల్లగొండ సభలో ‘మేడిగడ్డకు పోయా రా.. బొందలగడ్డకు పోయా రా?’ అనడం ఏమిటన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టునుతొందరగా నిర్మించాలనే ఆత్రుత తప్ప.. నాణ్యతను పట్టించుకోలేదన్నారు. కాళేశ్వరం నుంచి ప్రస్తుతం నీళ్లు ఎత్తిపోయడం సాధ్యం కాదని చెప్పారు.