హైదరాబాద్ : రాష్ట్రంలోని పేదల సొంతింటి కలను నిజం చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Minister Ponguleti) అన్నారు. ఈ బృహత్తరమైన కార్యక్రమాన్ని భద్రాచల(Bhadrachalam) రాముడి సన్నిధిలో ఈ పథకం మొదలు పెడుతున్నామన్నారు. ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే పేదల సంక్షేమం అన్నారు. అంతకుముందు భద్రాచలం(Bhadrachalam) సీతారామ చంద్రుల స్వామివారిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సోమవారం దర్శించుకున్నారు.
ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా గుట్టకు వచ్చిన ముఖ్యమంత్రికి ఆలయ సిబ్బంది పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామి వారి గర్భగుడిలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తదితర మంత్రులు పూజలు చేశారు. స్వామి వారికి సీఎం పట్టు వస్త్రాలు సమర్పించారు.