హైదరాబాద్ : రైతు(Farmers) దేశానికి వెన్నెముక. ఆ రైతుకు వెన్నుదన్నుగా నిలవాలనే ధృడ సంకల్పంతో అన్నదాతలకు ఆర్థిక సహకారం అందజేస్తున్నామని రెవెన్యూ శాఖామంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Minister Ponguleti) అన్నారు. తెలంగాణలో వ్యవసాయం మరింత లాభసాటిగా మారాలి. అంతిమంగా రైతు సోదరులు ఆర్థికంగా బలపడడానికి రైతాంగానికి ఎల్లవేళలా ఈ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. అందు కే రైతులకు రుణమాఫీ చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో 60 శాతం జనాభా వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నది.
వ్యవసాయ రంగం బాగుంటేనే రాష్ట్ర ప్రజలు రాష్ట్ర బాగుంటుంది, వ్యవసాయ రంగం అభివృద్ధికి మించిన ప్రాధాన్యత ఈ ప్రభుత్వానికి మరొకటి లేదు. భవిష్యత్తులో వ్యవసాయాన్ని ఉజ్వలంగా తీర్చిదిద్దాలన్నది ప్రభుత్వ సంకల్పమని చెప్పారు. రాబోయే కాలంలో ప్రభుత్వం రైతులకు మరింత అండగా నిలుస్తుంది. రైతును రాజు చేయాలన్నది ప్రభుత్వ అంతిమ లక్ష్యం. ఈ లక్ష్యం చేరుకోవడానికి పంట రుణ మాఫీ పథకం ద్వారా రైతన్నలకు మంచి ప్రారంభం లభించిందన్నారు. జూలై 18వ తేదీన లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేస్తున్నామని, ఆ రోజు సాయంత్రం వరకు రైతు ఖాతాలో డబ్బులు జమ చేస్తున్నామని పేర్కొన్నారు.