Minister KTR | హైదరాబాద్, మే 14 (నమస్తే తెలంగాణ): యూకే పర్యటనలో ఉ న్న రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మం త్రి కే తారక రామారావు పాత జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. లండన్లో 22 ఏండ్ల క్రితం దిగిన ఫొటో ను మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో ఆదివారం షేర్ చేశారు.
యూకే పర్యటన ముగించుకొని హైదరాబాద్ వస్తున్న క్రమంలో పాత ఫొటోను షేర్ చేశారు. ప్రస్తుతం ఆ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.
In London, 22 years back
Reminiscing as I return back home pic.twitter.com/XeejM8k8SA
— KTR (@KTRBRS) May 14, 2023
శంలోనే అత్యుత్తమ టెక్నాలజీ బిజినెస్ ఇంక్యుబేటర్గా టీ హబ్కు ప్రత్యేక గుర్తింపు లభించింది. నేషనల్ టెక్నాలజీ డేను పురస్కరించుకొని ఢిల్లీలో ఆదివారం జరిగిన నేషనల్ టెక్నాలజీ వీక్-2003 కార్యక్రమంలో కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీశాఖ మంత్రి డాక్టర్ జితేంద్రసింగ్ చేతులమీదుగా టీ హబ్ సీఈవో ఎంఎస్ రావు ఈ అవార్డును అందుకున్నారు. దేశంలోనే అత్యుత్తమ స్టార్టప్ ఇంక్యుబేటర్ అవార్డును టీ హబ్ ఫిబ్రవరిలో అందుకున్నది. నాలుగు నెలల వ్యవధిలోనే టీ హబ్కు జాతీయ స్థాయిలో రెండు అవార్డులు రావడం తెలంగాణకే గర్వకారణమని ఐటీశాఖ అధికారులు తెలిపారు. కాగా, టీ హబ్ సాధించిన విజయాల పట్ల సంతోషంగా ఉన్నదని మంత్రి కేటీఆర్ తెలిపారు. నేషనల్ టెక్నాలజీ అవార్డు-2023ను టీ హబ్ గెలుచుకున్నందుకు గర్వంగా కూడా ఉన్నదని ట్విట్టర్లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా టీ హబ్ బృందానికి ఆయన అభినందనలు తెలిపారు. టీహబ్ భారతదేశంలో బెస్ట్ టెక్నాలజీ ఇంక్యుబెటర్గా డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ద్వారా గుర్తింపు పొందిందని కేటీఆర్ వెల్లడించారు.
Happy & Proud that @THubHyd has won the National Technology Award -2023 (Technology Business Incubation) 😊
Many congratulations to Team T-Hub 👏
T- Hub has been recognised as the Best Technology Incubator in India by Department Of Science & Technology, Govt of India 🇮🇳 pic.twitter.com/0gbxYeNYpb
— KTR (@KTRBRS) May 14, 2023