హైదరాబాద్, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ): వినాయక చవితి పండుగ సందర్భంగా పర్యావరణ పరిరక్షణ, వాతావరణం, నీరు కాలుష్యం కాకుండా ప్రతిఒకరూ మట్టి వినాయక ప్రతిమలనే ప్రతిష్ఠించి పూజించాలని దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పిలుపునిచ్చారు. బొగ్గులకుంటలోని దేవాదాయశాఖ కార్యాలయంలో సోమవారం కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో తయారుచేసిన మట్టి వినాయక ప్రతిమలను మంత్రి పంపిణీ చేశారు. అనంతరం గణపతి పూజ విధానంపై దేవాదాయశాఖ రూపొందించిన బుక్ లెట్ను ఆవిషరించారు. ఈ సందర్భంగా మంత్రి అల్లోల మాట్లాడుతూ.. రంగు లు, రసాయనాలతో చేసిన వినాయక ప్రతిమలను నీటిలో నిమజ్జనం చేయడం వల్ల జలకాలు ష్యం ఏర్పడుతుందని, పర్యావరణ పరిరక్షణకు ము ప్పు వాటిల్లుతుందని తెలిపారు. పర్యావరణ పరిరక్షణలో తెలంగాణ ప్రభుత్వం కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో మట్టి వినాయక ప్రతిమలను రూపొందించి ఉచితంగా పంపిణీ చేస్తున్నదని చెప్పారు. కార్యక్రమంలో దేవాదాయశాఖ కమిషనర్ అనిల్కుమార్, అదనపు కమిషనర్ కృష్ణవేణి, జాయింట్ కమిషనర్ రామకృష్ణ అధికారులు పాల్గొన్నారు.