నిర్మల్ అర్బన్, ఫిబ్రవరి 23 : యాదగిరిగుట్ట క్షేత్రం తరహాలో దక్షిణ భారత దేశంలో ప్రసిద్ధిగాంచిన బాసర ఆలయ పునర్నిర్మాణం చేపడతామని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి తెలిపారు. బాసర ప్రధాన ఆలయ పునర్నిర్మాణం చేపట్టాలన్న సీఎం కేసీఆర్, మంత్రి ఇంద్రకరణ్రెడ్డి ఆదేశాలతో మూడురోజుల క్రితం బాసర ఆలయ బృం దం సభ్యులు శృంగేరి పీఠాధిపతి విదుశేఖర భారతీ స్వామి వద్దకు వెళ్లి సలహాలు, సూచనలు తీసుకొని వచ్చారు. ఈ సందర్భంగా గురువారం మంత్రి సదరు బృందం సభ్యులతో నిర్మల్లోని శాస్త్రినగర్లో సమీక్ష నిర్వహించారు. ప్రధాన ఆలయ అభివృద్ధి, విస్తరణ ప్లాన్తోపాటు ఆగమ, ఆలయ సంబంధమైన ప్రతిపాదనలను ఆ బృందం సభ్యులు మంత్రికి వివరించారు. మంత్రి స్పందిస్తూ శృంగేరి పీఠాధిపతి సూచనల మేరకు ఆలయ పునర్నిర్మాణానికి ప్రణాళిక సిద్ధం చేయాలని వారిని ఆదేశించారు. మాస్టర్ ప్లాన్ను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామని, ఆయన అనుమతి మేరకు పనులు చేపడుతామని తెలిపారు. సమీక్షలో ఈవో విజయరామారావు, స్థపతి వల్లి నాయగం, ఆలయ చైర్మన్ శరత్ పాఠక్, స్థానాచార్యులు పాల్గొన్నారు.