హైదరాబాద్, జూన్ 1(నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ దశాబ్ద కాలంలోనే అన్ని రంగాల్లో అనితర అభివృద్ధి సాధించి దేశానికి ఆదర్శంగా నిలిచిందని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. వ్యవసాయరంగం దశ దిశను మార్చి, తెలంగాణను దేశానికి అన్నపూర్ణగా నిలిపిన గొప్ప నేత కేసీఆర్ అని కొనియాడారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రజలకు, రైతులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.
రైతుబంధుతో రైతుల పెట్టుబడి బాధ తీరిందని, రైతుబీమా రైతులలో ఆత్మైస్థెర్యం నింపిందని తెలిపారు. 24 గంటల ఉచిత విద్యుత్తు సాగులో వెలుగులు నింపిందని, కాళేశ్వరం ప్రాజెక్టు రైతుల కన్నీటి వ్యథను తీర్చిందని పేర్కొన్నారు. మద్దతు ధరకు 100 శాతం పంటలు కొనుగోలు చేయడం ఒక తెలంగాణకే సాధ్యమయిందని తెలిపారు. రైతుబంధు కింద రూ.65 వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమచేసిన ఏకైక ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వమేనని పేర్కొన్నారు. వానకాలం రైతుబంధు సాయం అందిన తర్వాత రుణమాఫీ ఉంటుందని ప్రకటించారు. దేశమంతా నేడు తెలంగాణ మాడల్ను కోరుకుంటుందని, దేశానికి సీఎం కేసీఆర్ నాయకత్వం అత్యవసరమని అన్నారు.