వనపర్తి: తెలంగాణలో ఉపాధి అవకాశాలు పెరిగాయని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. యువత నూతనంగా ఆలోచించి భిన్నమైన రంగాలను ఎంచుకోవాలని సూచించారు. పల్లె నిద్రలో భాగంగా వనపర్తి జిల్లాలోని రేవల్లి మండలం తల్పునూరులో ప్రజల సమస్యలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గ్రామంలో వాడవాడనా తిరిగి పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. పల్లె నిద్రతో మరుగునపడిన సమస్యలు తన దృష్టికి వస్తున్నాయని చెప్పారు. వాటిని వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించానని చెప్పారు.
సీఎం కేసీఆర్ తీసుకుంటున్న నిర్ణయాలతో రాష్ట్రంలోని గ్రామాలు నివాస యోగ్యంగా మారాయన్నాయన్నారు. ఉపాధి అవకాశాలు పెరిగితే ఊర్లు స్వయం సమృద్ధి సాధిస్తాయన్నారు. సాగునీటి వసతితోపాటు, 24 గంటల ఉచిత కరెంటు అందిస్తుండటంతో బీళ్లన్నీ పొలాలుగా మారుతున్నాయని, దీంతో గ్రామాల్లో దారులు సమస్యగా తయారయ్యాయని చెప్పారు. కాగా, తుల్పునూరుకు చెందిన రుక్మాకర్ రెడ్డిని మంత్రి అభినందించారు. 35 ఏండ్ల తర్వాత అమెరికా నుంచి స్వగ్రామానికి వచ్చిన రుక్మాకర్.. మేకలు పెంచుకోవడం ఆశ్చర్యకరంగా ఉందన్నారు. దళితబంధులో కూడా ఇలాంటి యూనిట్లు అందిచవచ్చన్నారు.