వనపర్తి: ప్రజల ఆశీస్సులే ప్రభుత్వానికి భరోసా అని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. అన్నివర్గాల సంక్షేమం, అన్ని రంగాల అభివృద్ధే సీఎం కేసీఆర్ ఆకాంక్ష అని చెప్పారు. సంక్షేమ పథకాల అమలులో దేశంలో తెలంగాణ నంబర్ వన్గా ఉందన్నారు. వనపర్తిలోని తన క్యాంపు కార్యాలయంలో రూ.30 లక్షల 60 వేల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను 111 మంది లబ్దిదారులకు పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ.. కరోనా విపత్తులోనూ పేదలను దృష్టిలో పెట్టుకుని పథకాలు అమలు చేశామన్నారు.
పండుటాకులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలకు భరోసానిస్తూ ఆసరా పింఛన్లు అందిస్తున్నామన్నారు. దేశంలోనే అత్యధిక పింఛన్ ఇస్తున్నది తెలంగాణ ప్రభుత్వమేనని చెప్పారు. అభివృద్ధి, సంక్షేమంలో దేశంలో ఏ రాష్ట్రమూ తెలంగాణకు సాటిరాదని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం అన్ని ధరలు పెంచుతుండగా తెలంగాణ ప్రభుత్వం పేదలకు సంక్షేమ సాయం పెంచుతున్నది వెల్లడించారు.