వనపర్తి: ఆరోగ్యమే మహాభాగ్యమని, నిత్యం వ్యాయామం చేయడంతో ఎలాంటి సమస్యలు దరిచేరవని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. ప్రస్తుత సమాజంలో ఈ విషయంలో శ్రద్ద లోపించిందని చెప్పారు. వనపర్తి జూనియర్ కళాశాల మైదానంలో రూ.4 లక్షలతో ఏర్పాటు చేసిన వ్యాయామ పరికరాలను మంత్రి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. జిమ్ పరికరాలను ఏర్పాటు చేసిన విశ్రాంత సైనికుడు శివశంకర్ను అభినందించారు.
సెల్ఫోన్లు, ల్యాప్టాప్ల మోజులో యువత, పిల్లలు, పెద్దలు వ్యాయామానికి దూరంగా ఉంటున్నారని.. దీంతో అనవసర ఆరోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయని తెలిపారు. యువత, విద్యార్థులు ఆటలపై దృష్టిసారించాలని సూచించారు. తమకు నచ్చిన ఆటను నిత్యం సాధన చేయాలన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్లను వినియోగించుకోవాలని, శరీర దారుఢ్యం పెంచుకోవడంతో పాటు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని వెల్లడించారు.