BRS Party | వనపర్తి : భారత్ రాష్ట్ర సమితికి ప్రత్యామ్నాయం లేదు.. వరుసగా మూడోసారి అధికారంలోకి రావడం ఖాయం అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి( Minister Niranjan Reddy ) స్పష్టం చేశారు. పనిచేసే ప్రభుత్వానికి ప్రజల ఆశీస్సులు తప్పకుండా ఉంటాయన్నారు. అభివృద్ధిని చూసే బీఆర్ఎస్ పార్టీ( BRS Party )లోకి చేరికలు కొనసాగుతున్నాయని తెలిపారు. తొమ్మిదేండ్లలో తెలంగాణ అభివృద్ధి( Telangana Development ) దేశానికి ఆదర్శంగా నిలిచింది అని పేర్కొన్నారు. వివిధ రంగాలలో కేంద్రం ఇస్తున్న అవార్డులే దీనికి సాక్ష్యం అని నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు.
వనపర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వనపర్తి మండలం అప్పాయిపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు( Congress Activists ) 40 మంది పానుగంటి విజయ్ మోహన్ ఆధ్వర్యంలో, మంత్రి నిరంజన్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరందరికి మంత్రి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
అనంతరం వనపర్తికి చెందిన పండితులు ఓరుగంటి మనోహర శర్మ, ఓరుగంటి నాగరాజు శర్మలు రూపొందించిన శోభ కృత్ నామ సంవత్సర పంచాంగం పుస్తకాన్ని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆవిష్కరించారు. శ్రీనివాస్ పూర్ పరిధిలోని లక్ష్మీకుంటను మంత్రి సందర్శించారు.