న్యూఢిల్లీ, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ): కేంద్రం మొండివైఖరి విడనాడి, షరతులు లేకుండా యాసంగి ధాన్యం కొనుగోలు చేయాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం ఢిల్లీలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో నిర్వహించనున్న దీక్ష అత్యంత చరిత్రాత్మకం అవుతుందని పేర్కొన్నా రు. ఢిల్లీలో ఆదివా రం ఆయన మీడియాతో మాట్లాడు తూ.. అతిపెద్ద పార్లమెంటరీ ప్రజాస్వా మ్య దేశంలో ఒక రాష్ట్రం తరలివచ్చి దీక్ష చేయడం మామూలు విష యం కాదని చెప్పారు. కేంద్రం పరిస్థితిని ఇంతవరకు తీసుకురావాల్సింది కాదని హితవు పలికారు. ధాన్యం కొనుగోలుపై కేంద్రం వైఖరి దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తంచేశారు. దేశంలో వ్యవసాయ ఉత్పత్తుల సేకరణకు ఒకే విధానం ఉండాలని డిమాండ్ చేశారు. రైతులను అవమానపరిచిన వారు బాగుపడింది లేదని, రైతుల ఆగ్రహ జ్వాలల ను కేంద్రం తకువగా అంచనా వేయొద్దని హెచ్చరించారు. 2001-02లో వాజపేయి హయాంలో రంగు మారిన ధాన్యం కొనుగోలుకు ఎఫ్సీఐ నిరాకరిస్తే, పంజాబ్ ప్రభుత్వ ఆందోళనలతో కేంద్రం దిగివచ్చిందని గుర్తుచేశారు. దీక్ష అనంతరం తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు.