హైదరాబాద్ : ఉద్యోగ ప్రధాత అని సీఎం కేసీఆర్ అని టీఆర్ఎస్ లోక్సభా పక్షనేత నామా నాగేశ్వర్రావు కొనియాడారు. రాష్ట్ర అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ఉద్యోగ ప్రకటన చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల కల పరిపూర్ణం అయ్యిందన్నారు. పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో నీళ్లు, నిధులు, నియామకాలు కల నెరవేరిందని, ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికతతో తెలంగా ప్రజల కల సాకారమైందన్నారు.
ఉద్యమంలో విద్యార్థులు, యువత పాత్ర కీలకమైందన్నారు. ఇదిలా ఉండగా.. అసెంబ్లీ సాక్షిగా ఉద్యోగాల భర్తీ ప్రకటన చేసిన సందర్భంగా మంత్రి శ్రీనివాస్గౌడ్, ఎమ్మెల్యేలు వెంకటేశ్వర్రెడ్డి, నరేందర్రెడ్డి, చిట్టెం రామ్మోహన్రెడ్డి, రాజేందర్రెడ్డి సీఎం కేసీఆర్ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.