హైదరాబాద్: స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా పోలీసు శాఖ ఆధ్వర్యంలో 5 కే రన్ (5K run) నిర్వహించారు. హైదరాబాద్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ వద్ద మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, సీఎస్ సోమేష్ కుమార్, సీపీ సీవీ ఆనందర్ 5 కే రన్ను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా హోం మంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ.. గాంధీజీ శాంతియుతంగా పోరాడి దేశానికి స్వాతంత్య్రం తీసుకొచ్చారని చెప్పారు.
5 కే రన్లో విద్యార్థులు పాల్గొనడం అభినందనీయం అన్నారు. బంగారు తెలంగాణ సాధించే దిశగా చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు. యువత తెల్లవారుజామున లేచి వ్యాయామాలు చేయాలని సూచించారు. ఈనెల 15న ఇంటింటా జాతీయ జెండా ఎగరాలని మహమూద్ అలీ చెప్పారు. ఎందరో మహనీయుల త్యాగాల ఫలితంగా దేశానికే స్వాతంత్య్రం వచ్చిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. 5 కే రన్లో యువత భారీ సంఖ్యలో పాల్గొన్నారు.