హైదరాబాద్, మార్చి 21 (నమస్తే తెలంగాణ): గుజరాత్లోని మోసగాళ్లందరికీ ప్రత్యేక మినహాయింపు ఉంటుందా? అం టూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ కేంద్రంపై మండిపడ్డారు. 13,500 కోట్ల బ్యాంకు మోసాలకు పాల్పడిన మెహు ల్ చోక్సీకి కేంద్ర ప్రభుత్వం స్కాట్ ఫ్రీగా ఎన్వోసీ ఇవ్వడంపై కేటీఆర్ మంగళవారం ట్విట్టర్లో స్పందించారు.
చోక్సీ రాజా సత్యహరిశ్చంద్ర బంధువు అయినట్టు స్కాట్ ఫ్రీగా ప్రయాణించడానికి ఎన్వోసీ ఇవ్వడంపై కేటీఆర్ కేంద్రాన్ని ప్రశ్నించారు.