నల్లగొండ : ఈనెల 14 న నాగార్జునసాగర్ నియోజకవర్గంలో మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు.
హాలియా, నందికొండ మున్సిపాలిటీలకు సంబంధించి రూ. 56 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపన చేయనున్నారు. కాగా, మంత్రి కేటీఆర్ పర్యటనకు సంబంధించి స్థానిక ఎమ్మెల్యే నోముల భగత్ కలిసి జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ శుక్రవారం ఏర్పాట్లను పరిశీలించారు.
హాలియా మున్సిపాలిటీ లో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డ్, మినీ స్టేడియం, డిజిటల్ లైబ్రరీ, వైకుంఠ ధామం, నాగార్జునసాగర్ మున్సిపాలిటీకి సంబంధించి ఆడిటోరియం, డిజిటల్ లైబ్రరీ, బస్టాండ్ పునర్నిర్మాణం, షాపింగ్ కాంప్లెక్స్ ఏర్పాటు తదితర అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం సభను నిర్వహించనున్నారు. మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
వీరి వెంట మిర్యాలగూడ ఆర్డీవో రోహిత్ సింగ్, పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ ఎస్ఈ వెంకటేశ్వర్లు ఈఈ సత్యనారాయణ హాలియా మున్సిపల్ చైర్ పర్సన్ వెంబడి పార్వతమ్మ, వైస్ చైర్మన్ నల్గొండ సుధాకర్, హాలియా, సాగర్ మున్సిపల్ కమిషనర్లు వేమన రెడ్డి, రవీందర్ రెడ్డి, అనుముల మండలం తాసిల్దార్ లావూరి మంగ, ఎంపీడీవో లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.