KTR | హైదరాబాద్ : నూతన సచివాలయం ఆదివారం ప్రారంభం కానుంది. మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు తమకు కేటాయించిన చాంబర్లలో ఆశీనులు కానున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి, మంత్రులు పలు దస్త్రాలపై సంతకాలు చేయనున్నారు.
రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పట్టణాభివృద్ధి, మున్సిపాలిటీ శాఖల మంత్రి కేటీఆర్ కొత్త సచివాలయంలో తన విధులను ప్రారంభించనున్న సందర్భంగా అత్యంత కీలక దస్త్రంపై తొలి సంతకం చేయనున్నారు. హైదరాబాద్లో లక్ష మందికి డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీ దస్త్రంపై కేటీఆర్ తొలి సంతకం చేయనున్నారు. పేద ప్రజల కోసమే డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీ దస్త్రంపై తొలి సంతకం చేస్తున్నట్లు కేటీఆర్ ప్రకటించారు.