రాజన్న సిరిసిల్ల : రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటనలో ఉన్న రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్.. వీర్నపల్లి రైతు వేదికలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాన్ని సందర్శించారు.
ఈ సందర్భంగా కంటి వెలుగు కార్యక్రమం ఎలా ఉందని లబ్దిదారులను అడిగి తెలుసుకున్నారు. వృద్ధులకు ఎంతో ఉపయోగకరంగా ఉందని వారు కేటీఆర్కు వివరించారు. కంటి వెలుగు శిబిరం వివరాలు, ఇప్పటి వరకు ఎంత మందికి పరీక్షలు నిర్వహించారు, కండ్లద్దాలు పంపిణీ చేశారనే విషయాలను సిబ్బందిని అడిగి కేటీఆర్ తెలుసుకున్నారు.
కేటీఆర్ వెంట జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణా రాఘవ రెడ్డి, కలెక్టర్ అనురాగ్ జయంతి, రాష్ట్ర పవర్లూం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గూడూరి ప్రవీణ్, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు ఉన్నారు.