KTR | మంచిర్యాల : మంచిర్యాల జిల్లా పర్యటనలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ బెల్లంపల్లిలోని ఐటీ కంపెనీలను సందర్శించారు. వాల్యూపిచ్, సనాతన అనలైటిక్స్, రిక్రూట్మెంట్ సర్వీసెస్ కంపెనీలను సందర్శించిన కేటీఆర్.. ఆ కంపెనీల ఉద్యోగులతో ఇంటరాక్ట్ అయ్యారు. బెల్లంపల్లిలో ఓ రెండు ఐటీ కంపెనీలను నెలకొల్పడం పట్ల తాను ఇంప్రెస్ అయ్యానని కేటీఆర్ పేర్కొన్నారు. 250 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం గొప్ప విషయమని కేటీఆర్ అన్నారు.
ఈ సందర్భంగా వాల్యూపిచ్, సనాతన ఐటీ కంపెనీల యాజమాన్యాలను కేటీఆర్ ప్రశంసించారు. బెల్లంపల్లి, మంచిర్యాల యువతకు, హైదరాబాద్, బెంగళూరులో పని చేసే యువత టాలెంట్ విషయంలో ఎలాంటి తేడా లేదని కేటీఆర్ అన్నారు. రూరల్ టెక్నాలజీ పాలసీకి నాయకత్వం వహించాలని కేటీఆర్ పేర్కొన్నారు.
IT and Industries Minister @KTRBRS visited offices of IT companies @valuepitch and Sanathana Analytics and Recruitment Services located in Bellampalli and interacted with the employees there.
The Minister said that he was impressed that two IT companies are functioning in… pic.twitter.com/zNJXwPtBOo
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) May 8, 2023