ధర్మారం, ఏప్రిల్ 27: పోలీసుల అక్రమ కేసులో పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రానికి చెందిన బీఆర్ఎస్ సోషల్ మీడి యా మండల ప్రధాన కార్యదర్శి సల్వాజీ మాధవరావుకు బెయిల్ వచ్చింది. శనివారం సాయంత్రం కరీంనగర్ జిల్లా జైలు నుంచి విడుదలయ్యారు.
మార్చి 18న సల్వాజీ మాధవరావుపై యూత్ కాంగ్రెస్ నాయకుడు సోగాల తిరుపతి దాడి చేయడమే కాకుండా ఎస్సీ కులం పేరిట దూషించారని ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశా రు. దాడి చేసిన తిరుపతిపై మాత్రం పోలీసు లు కేసు నమోదు చేయలేదు. ఈ నెల 25 వరకు కోర్టు రిమాండ్ విధించడంతో కరీంనగర్ జిల్లా జైలుకు తరలించారు. పార్టీ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే హరీశ్రావు, పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్, పార్టీ లీగల్ సెల్ చొరవతో మాధవరావుకు బెయిల్ వచ్చింది.